ఖైదీలూ...వెళ్ళి'రండి'

ఖైదీలకు శుభవార్త, సంక్రాంతి పండుగను తమ తమ కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు అవకాశం లభించింది.అయితే ఇది అందరు ఖైదీలకు మాత్రం కాదు, కేవలం 400 సత్ప్రవర్తన కలిగిన గుడ్ ఖైదీలకు మాత్రమే.

 Bumper Offer To Prisoners-TeluguStop.com

విషయం ఏమిటంటే జైలు అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల మంది ఖైదీలకు పెరోల్ లభించింది.రాష్ట్రంలో ఉన్న తొమ్మిది సెంట్రల్ జైళ్లలో ఐదు వేల మందికి పైా ఖైదీలు నిర్బంధంలో ఉన్నారు.

వీరిలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు తరచూ పెరోల్‌పై విడుదల చేస్తారు.ప్రస్తుతం పొంగల్ పండుగ సందర్భంగా చాలా మంది ఖైదీలు పెరోల్ కోరుతూ జైలు అధికారులకు వినతిపత్రా లు అందజేశారు.

దీని ప్రకారం తొమ్మిది సెంట్రల్ జైళ్ల నుంచి సుమారు 400 ఖైదీలకు పెరోల్ అందజేసినట్లు జైలు అధికారి ఒకరు తెలిపారు.దీని ప్రకారం సేలం సెంట్రల్ జైళ్లో 400 మంది శిక్షా ఖైదీలకు పెరోల్ లభించింది.

ఒక్కొక్కరికి మూడు రోజుల నుంచి ఆరు రోజుల వరకు పెరోల్ అందజేశారు.దీని గురించి జైలు అధికారి మాట్లాడుతూ జైలులో వున్న శిక్షా ఖైదీ ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని పెరోల్ అందజేస్తామన్నారు.

ఈ పెరోల్ ముగియగానే వారు జైళ్లకు తిరిగి వచ్చేయ్యాల్సిందే అని తెలిపారు.ఏది ఏమైనా అనేక ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube