తెలంగాణ ప్రభుత్వానికి బంగారు బాతులా మారిన వారు ఎవరంటే మందుబాబులని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే వీరి వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ రాబడి ఉంది.
అందుకే తాగండి తాగి ఊగండి అంటూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు పర్మిషన్లను ఇస్తుందట.
ఇకపోతే తెలంగాణ ప్రభుత్వ ఖజానాను నింపడంలో ఎక్సైజ్ శాఖ మొదటి స్దానంలో ఉందన్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా, వైన్స్ షాపు యజమానులు, బార్ల యజమానులకు అబ్కారీ శాఖ బంపరాఫర్ ఇచ్చింది.ఇదివరకు మద్యం షాపులకు సరకు కావాలంటే మొదటగా డీడీ ఇస్తేనే సరఫరా చేసే ఎక్సైజ్ శాఖ, ఇకపై చెక్కులను కూడా తీసుకుంటామని స్పష్టం చేసింది.
అయితే, చెక్ బౌన్స్ అయితే మాత్రం దాని విలువలో 20 శాతం జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది.
కాగా ఈ ఆఫర్ వారంలో రెండు రోజులు మాత్రమే అంటే శని, ఆదివారాల్లో మద్యం వ్యాపారానికి బ్రేక్ పడకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఇకపోతే రూ.75 కోట్లు ఆదాయాన్ని మునిసిపాలిటీల పరిధిలో బార్ల లైసెన్స్ లను ప్రకటించిన ఎక్సైజ్ శాఖ, ఔత్సాహిక వ్యాపారుల నుంచి దరఖాస్తు ఫీజు రూపంలో పొందిన సంగతి తెలిసిందే.ఇంకా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగడానికి ఇప్పుడు చెక్కులను తీసుకుంటుందట.