న్యూ ఇయర్ సందర్భంగా అనేక వ్యాపారస్థులు ఆఫర్ల వర్షం కురిపించారు.తమ షాపులో ఏది కొన్నా మరొకటి ఉచితంగా ఇస్తామంటూ కొందరు, మరికొంత మంది తమ వద్ద వస్తువులను తక్కువ ధరకే అందిస్తామంటూ ఆఫర్లు ప్రకటించారు.
అయితే తమిళనాడులో మాత్రం ఓ షాపు ఓనర్ ఇచ్చిన ఆఫర్ మరే ఇతర వ్యాపారి కూడా ఇవ్వలేదు.అతడి వద్ద కేవలం 20 పైసలకే కొనుగోలు చేయవచ్చంటూ ప్రకటించాడు.ఇంతకీ అక్కడ ఏం కొనుగోలు చేయొచ్చు అని అనుకుంటున్నారా?
తమిళనాడులోని తిరుత్తణిలో ఓ దుస్తుల దుకాణుదారుడు న్యూ ఇయర్ ఆఫర్ కింద తన దుకాణంలో రూ.300 విలువ చేసే టీషర్టును చలామణిలో లేని 20 పైసల నాణేలకు అందిస్తున్నట్లు ప్రకటించాడు.దీంతో ఆ దుకాణం ముందు జనాలు క్యూ కట్టారు.అయితే షాపు ఓనరు ఊహించని విధంగా భారీ సంఖ్యలో జనాలు అక్కడికి చేరుకున్నారు.దీంతో తొలి వంద మందికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించాడు ఆ ఓనర్.
న్యూ ఇయర్ రోజున ఇలా జనాలను ఇబ్బంది పెట్టడం ఏంటని, అది నమ్మి వచ్చిన భారీ సంఖ్య జనాలను మోసం చేసినట్లే అయ్యిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూ ఇయర్ రోజున ఇలా ఆఫర్ పెట్టి ఇలా ఉసూరుమనిపించడం ఏమిటని వారు తెలిపారు.ఏదేమైనా ఆఫర్ అనగానే వెనకా ముందు ఆలోచించకుండా వెళ్లే వారికి ఇలానే జరగాలని పలువురు కామెంట్ చేస్తున్నారు.