ప్రస్తుతం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.ఈ ఉప ఎన్నికలో విజయం దిశగా ప్రతి ఒక్కరూ రకరకాల వ్యూహాలు పన్నుతూ విజయం సాధించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.అందుకే ఇటు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ని టార్గెట్ చేస్తుండగా, బీజేపీ పార్టీ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇక రోజు రోజుకు ఉప ఎన్నిక పోలింగ్ కు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్న పరిస్థితి ఉంది.ఇక పార్టీలు కూడా తమ ప్రత్యర్థి పార్టీలపై విమర్శల దాడిని పెంచుతున్న పరిస్థితి ఉంది.
అయితే తాజాగా హరీష్ రావు ఈటెల రాజేందర్ పై చేసిన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.రాజేందర్ బీజేపీ జెండా మోయడమే కాదని, బీజేపీ ఎజెండా కూడా మోయాలని ఈటెల పై విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉంది.బీజేపీ గెలుపుపై ఆశలు పెట్టుకున్నదని, టీఆర్ఎస్ మెజారిటీ కొరకు ప్రయత్నిస్తున్నదని ప్రజలు ఎప్పుడూ టీఆర్ఎస్ వెంట ఉన్నారని, భవిష్యత్తులో కూడా ఉంటారని ఇతర పార్టీలు పెద్ద ఎత్తున కలలు కంటున్నారని హరీష్ రావు బీజేపీపై మండి పడ్డారు.
ఉప ఎన్నిక పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్న క్రమంలో హరీష్ రావు వ్యూహాలను అత్యంత వేగంగా అమలుపరుస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ గెలవడానికి ఉన్న అన్ని అవకాశాలను వంద శాతం వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.