నూతన జిల్లా నంద్యాలలో పర్యటించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నూతన జిల్లా నంద్యాలలో విస్తృత పర్యటించారు.నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన కలెక్టర్ కార్యాలయం,ఎస్పీ కార్యాలయాలను ఆయన పరిశీలించారు.

 Buggana Rajendranath Reddy Touring The New District Nandyal  Buggana Rajendranat-TeluguStop.com

అలాగే మిగతా జిల్లా కార్యాలయ భవనాలను త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు.మంత్రి బుగ్గన వెంట నంద్యాల జిల్లా స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా,ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డి,కలెక్టర్ కోటేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ చిదానంద రెడ్డి తదితరులు పరిశీలించారు.

అనంతరం నంద్యాల జిల్లా స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏప్రిల్ 4వ తారీఖున నూతన జిల్లాల ఏర్పాటు లో భాగంగా నంద్యాల జిల్లాగా ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డికి నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నంద్యాల జిల్లాకు కావలసిన అన్ని కార్యాలయాలను పరిశీలించడం జరిగిందని నూతనంగా కలెక్టర్ కార్యాలయాన్ని ఆర్ ఎ ఆర్ ఎస్ లో ఏర్పాటు చేశారు.

అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయం,సబ్ కలెక్టర్ కార్యాలయాలను పరిశీలించడం జరిగినదని అన్నారు.అయితే మరికొన్ని జిల్లా కార్యాలయాలను పరిశీలించడం జరిగిందని ప్రజలు అందుకు సహకరించి నంద్యాలను జిల్లాగా ప్రకటించడం నంద్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అని అన్నారు.

ప్రజలందరూ సహకరించి నంద్యాల నూతన జిల్లాగా ఏప్రిల్ 4 వ తేదీ ఉదయం 9 గంటలకు రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రారంభిస్తారని ఆయన అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube