ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లాలో ఒక వింత సంఘటన జరిగింది.ఒక దూడ రెండు తలలతో పుట్టడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
అంతేకాకుండా ఈ దూడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా వస్తున్నారు.ఇక కరోనా కష్ట సమయంలో ఇలాంటి వింతలు జరుగుతుండడంతో… ఈ విషయం గురించి అక్కడ స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
ఇక ఈ విషయం గురించి కాస్త పూర్తి వివరాల్లోకి వెళితే…
జిల్లాలోని రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన గరికపాటి వెంకటేశ్వరరావు ఇంట్లో ఒక గేదె ప్రసవించింది.ఇకపోతే అప్పుడే పుట్టిన దూడకు రెండు తలలు ఉండడం విశేషం.
అయన కూడా ఆ దూడ బాగా ఆరోగ్యకరంగానే ఉంది.ఇకపోతే ఈ విషయాన్ని పశు వైద్య అధికారులకు తెలియజేయడంతో జన్యుపరమైన కారణాల వల్ల ఇలా జరిగి ఉండవచ్చు అని వారు తెలియచేస్తున్నారు.
ఇక ఈ రెండు తలలు ఉన్న దూడ ఎన్ని రోజులు బ్రతికి ఉంటుందో అన్న సందేహం అందరిలో మెలుగుతుంది.
ఏది ఏమైనా ఈ కరోనా కాలంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో ముందు ముందు ఎన్ని వింతలు, విన్యాసాలు చూడాల్సి వస్తుందో అని ప్రజలు అనుకుంటున్నారు.
నిజానికి 2020 సంవత్సరం మొదటి నుంచి ప్రపంచంలో ఏదో ఒక మూలన ఏదో ఒక సంఘటన భారీ మొత్తంలో వినాశనం జరుగుతోంది.కాబట్టి ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.