ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తూ ఉంటే ఏపీని మాత్రం జగరోనా వైరస్ వణికిస్తుందంటూ తెలుగు దేశం పార్టీ నేత బుద్ద వెంకన్న అన్నాడు.కరోనా వైరస్ వల్ల జనాలు మృతి చెందుతూ ఉంటు జగరోనా వైరస్ వల్ల రాష్ట్రం అభివృద్ది ఆగిపోయిందని.
పెట్టుబడులు రావడం లేదు అంటూ ట్వీట్ చేశాడు.కరోనా అమ్మ మొగుడు ఈ జగరోనా అన్నాడు.
ప్రస్తుతం ఈ వైరస్ గురించే ప్రజలు అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు.ఇంకా మీ చెవికి చేరలేదా విజయసాయి రెడ్డి గారు అంటూ ఎద్దేవ చేశాడు.
9 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్కు పట్టిన ఈ కరోనా వైరస్ వల్ల అన్ని విధాలుగా నష్టాలు జరుగుతున్నాయని అన్నాడు.రాష్ట్రం ఆదాయం ఆవిరైంది.
అభివృద్ది ఆగిపోయింది.రాష్ట్రం అంతా కూడా జగరోనా వైరస్తో అల్లాడిపోతుంది.
ఈ జగరోనా వైరస్ను కట్టడి చేయగల శక్తి కేవలం సెర్బియ దేశానికే ఉందంటూ బుద్ద వెంకన్న కామెడీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్పై వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
జగన్పై బుద్ద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ట్విట్టర్లో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు.