పార్లమెంట్ లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు.మహిళా సమ్మాన్ బచత్ పత్ర పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు.
రెండేళ్ల వరకు అందుబాటులో ఉండనున్న ఈ పథకం వన్ టైమ్ చిన్న మొత్తాల పొదుపు పథకం.దీనిపై 7.5 శాతం వడ్డీ లభించనుంది.
అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ట పరిమితిని రెట్టింపు చేశారు.దీంతో ప్రస్తుతం గరిష్ట పరిమితి రూ.30 లక్షలకు పెరిగింది.అంతేకాకుండా సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తుల వారికి సహాయపడే విధంగా ప్రధాన మంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజీ పథకాన్ని సైతం ప్రకటించారు.