భారతావని నుంచి బౌద్ధాన్ని స్వీకరించిన జపాన్, ఆంధ్రా రాజధాని అమరావతిని తమ టోక్యోలా తీర్చి దిద్దే బాధ్యత జపాన్ ప్రభుత్వానిదేనన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.సోమవారం జపాన్ వాణిజ్య మంత్రి టకాగి నేతృత్వంలో 80 మందికి పైగా వివిధ సంస్థల ప్రతినిధుల బృందం చంద్ర బాబుని కల్సిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసారు.
అసలు బౌధ్ధానికి అమరావతి అభివృద్ధికి లింకేంటన్న సంశయాన్ని కూడా తీర్చేసారయన.
జపాన్ దేశంలో రెండవ బుద్ధునిగా మన నాగార్జునుడుని పిలుస్తారని, ఆతను జన్మించి, నడయాడిన ఈ నేల నుంచే బౌద్ధం వికసించిందని, అందుకే తమ అభివృద్ధికి శాయశక్తులా సాయం చేయాలన్నది మన సిఎం గారి మాటల్లో అంతరార్ధం.
ఇప్పటికే రాజధానిలోని నిర్మాణ భవనాలకు జపాన్కు చెందిన మాకీ సంస్ధ రూపకల్పన చేస్తున్న విషయాన్ని ఆ బృందానికి తెలియలిజేస్తూ, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన సందర్హంగా ఇలా వ్యాఖ్యలు చేసారు.
అయితే రాజధాని నిర్మాణానికి నాలుగు కాసులివ్వండి మహా ప్రభో! అని డిల్లీ పీఠం ముందు ప్రదక్షణలు చేస్తు, కాళ్ళా, వేళ్ళా, గోళ్ళా పడ్డా కనికరించని వ్యవహారం తెలియజేప్పెందుకే ఇలా సున్నితంగా ఇలా వ్యాఖ్యానించినట్లు ఓ గుసగుస…
.