వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.దమ్ముంటే మళ్లీ ఉత్తరాంధ్రకు ఇంఛార్జ్ గా రావాలని చెప్పారు.
ఉత్తరాంధ్రలో 34 సీట్లలో వైసీపీ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.ఇదేం కర్మ స్లోగన్ జగన్ పాలనతో ప్రజల నుంచి వచ్చిందన్నారు.
బీసీల గర్జన పెట్టే అర్హత జగన్ కు లేదని వెల్లడించారు.బీసీలకు ఏవరేం చేశారనే దానిపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక బలహీన వర్గాలకే 75 శాతం పదవులు ఇచ్చారన్నారు.కొడాలి, పేర్ని నాని సినిమా అయిపోయిందని విమర్శించారు.