మెగా మేనల్లుడు.సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతోనే సంచలనం సృషించాడు.
మెగా హీరోల్లో నేను కూడా ఉన్నానంటూ తన స్టామినా నిరూపించుకున్నాడు.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బుచ్చిబాబు సానాకు కూడా ఇది మొదటి చిత్రమే.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సుకుమార్ శిష్యుడిగా అతడి పేరు నిలబెట్టాడు.ఇప్పటికి విజయవంతంగా దూసుకుపోతున్న ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు మంచి పాపులారిటీ కూడా సంపాదించుకున్నాడు.
ఈ సినిమా హిట్ అవ్వడంతో బుచ్చిబాబుతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మరో రెండు సినిమాలు చేయడానికి సిద్ధం అయ్యిందని తెలుస్తుంది.ఇందులో ఒక సినిమా ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఒక కథ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తుంది.ఈ కథను ఎన్టీఆర్ కు త్వరలోనే వినిపించి అయన నుండి గ్రీన్ సిగ్నల్ పొందాలని బుచ్చిబాబు అనుకుంటున్నాడట.
బుచ్చిబాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాకు కో డైరెక్టర్ గా పనిచేసాడు.ఆ సమయంలో బుచ్చిబాబు ఎన్టీఆర్ కు బాగా దగ్గరయ్యాడట.ఈ చనువుతోనే బుచ్చిబాబును ఎన్టీఆర్ ఒక కథ చెప్పమని అడిగారని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక కథను సిద్ధం చేసాడట.
అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా.దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నాడు.
ఎన్టీఆర్ కు బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చితే ఈ రెండు సినిమాల తర్వాతే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది.