మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఉప్పెన’.పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదల అయ్యి ఉప్పెన సృష్టించిందనే చెప్పాలి.
బుచ్చిబాబు సానా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సుకుమార్ శిష్యుడిగా అతడి పేరు నిలబెట్టాడు.ఈ సినిమాతో బుచ్చిబాబు మంచి పాపులారిటీ కూడా సంపాదించుకున్నాడు.
ఈ సినిమా హిట్ అవ్వడంతో బుచ్చిబాబుతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మరో రెండు సినిమాలు చేయడానికి సిద్ధం అయ్యిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.ఇందులో ఒక సినిమా ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లు ఎప్పటి నుండో వినిపిస్తున్న టాక్.
ఇప్పటికే బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఒక కథ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తుంది.ఈ కథను ఎన్టీఆర్ కు త్వరలోనే వినిపించి అయన నుండి గ్రీన్ సిగ్నల్ పొందాలని బుచ్చిబాబు అనుకుంటున్నాడట.
బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక కథను సిద్ధం చేసాడని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అవన్నీ రూమర్స్ అనే తేలిపోయాయి.తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బుచ్చిబాబు ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసాడు.
ఇప్పటి వరకు వీరి కాంబోలో సినిమా ఎలా ఉండబోతోందని అభిమానులు చర్చించుకున్నారు.తాజాగా ఈయన చేసిన పోస్ట్ లో ఎన్టీఆర్ తో సినిమా ఎలా ఉండబోతుందో బుచ్చిబాబు అభిమానులకు హింట్ ఇచ్చాడు.
ఆయన పోస్ట్ చేస్తూ.లోకల్ కథతో ట్రెండ్ సృష్టిద్దాం అంటూ అందుకోసం వేచి చూస్తున్నాను సర్ అంటూ బుచ్చిబాబు పోస్ట్ చేసారు.
దీన్ని బట్టి ఈ సినిమా మరొక రేంజ్ లో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.చూడాలి మరి ఎలా ఉంటుందో.