ప్రస్తుతం వరుస సినిమాలతో సినీ పరిశ్రమ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.ఈ ఏడాది ఎన్నో సినిమాలు తెరకెక్కనున్నాయి.
కాగా ఫిబ్రవరి లో విడుదల కానున్న మెగా ఫ్యామిలీ అల్లుడు సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి అల్లుడు వైష్ణవి తేజ్ నటించిన సినిమా ఉప్పెన.
ఈ సినిమాతో తొలిసారిగా వెండితెరకు పరిచయం కానున్నాడు.అయితే ఈ సినిమాను తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న బుచ్చిబాబు సన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.
సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు దర్శకుడిగా మారగా.తొలిసారిగా దర్శకత్వం వహించినందుకు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ విధంగా బుచ్చిబాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమా లో పని చేశాడు.ఆ సినిమా సమయంలో బుచ్చిబాబు ఎన్టీఆర్ తో ఎంతో చనువుగా ఉండేవాడు.
ఈ విధంగా తాను తొలిసారిగా తీయాలనుకున్న ఉప్పెన సినిమా కథ గురించి మొదటిసారిగా ఎన్టీఆర్ కు వినిపించాడట.
అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ ను కూడా ఎన్టీఆర్ చేతుల మీదుగా నే విడుదల చేయించాడు బుచ్చిబాబు.బుచ్చిబాబు కు ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానం అందరికీ అర్థమౌతుంది.అయితే ఈ సినిమా కథను ముందుగా ఎన్టీఆర్ కు వినిపించగా.
ఎన్టీఆర్ కూడా మద్య మద్య లో సినిమా గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే వాడట.ఈ విధంగా బుచ్చిబాబు తన మీద ఉన్న అభిమానంతో ఎన్టీఆర్ కు కథ వినిపించాడ లేదా సినిమాల్లో నటించమని అడిగాడా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.
కాగా ఈ సినిమాకు బుచ్చిబాబు మొదటిసారిగా దర్శకత్వం వహించగా.ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.కాగా ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 12 న విడుదల చేయడానికి చెట్నీ బృందం ఏర్పాటు చేసింది.