ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మొదటి సినిమాతోనే వంద కోట్ల కలెక్షన్స్ రికార్డ్ సృష్టించిన దర్శకుడుగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా నిలిచాడు.ఇక ఉప్పెన లాంటి సినిమా ఇవ్వడంతో మైత్రీ నిర్మాతలు బుచ్చిబాబుకి ఏకంగా కారు గిఫ్ట్ గా ఇచ్చారు.
ఇక మొదటి సినిమా సక్సెస్ కారణంగా బుచ్చిబాబుకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.చాలా మంది నిర్మాతలు ఇప్పటికే ఇతనికి అడ్వాన్స్ లు ఇచ్చేశారు.
కింగ్ నాగార్జున కూడా అఖిల్ కోసం మంచి కథ సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే బుచ్చిబాబు మాత్రం తన నెక్స్ట్ సినిమాని స్టార్ హీరోతో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
అయితే రామ్ చరణ్, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ తో నెక్స్ట్ సినిమా చేయాలని బుచ్చిబాబు కథలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.అదే సమయంలో తన నెక్స్ట్ సినిమాని మైత్రీ మూవీస్ నిర్మాతలకే చేయడానికి ఫిక్స్ అయ్యాడు.
ఇక ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బెస్డ్ కాన్సెప్ట్ ని సిద్దం బుచ్చిబాబు చేశాడట. పిరియాడికల్ స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం హిందీ మూవీ దంగల్ తరహాలో ఈ సినిమా ఉంటుందని టాక్.
ఇందులో ఎన్టీఆర్ 60 ఏళ్ల మాజీ ఆటగాడిగా కనిపించాల్సి ఉంటుందని.ఆ పాత్ర చూట్టు ఈ కథ తిరగనుందని తెలుస్తుంది.ఇటీవల ఎన్టీఆర్ను కలిసి బుచ్చి కథ వివరించినట్లు తెలుస్తోంది.అయితే ఇంతవరకు దీనిపై ఎన్టీఆర్ స్పందించలేదని ఆయన గ్రీన్ సిగ్నిల్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమచారం.
ఒకవేళ అంతా ఒకే అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ సంస్థ నిర్మించనుంది.కథలో సగభాగం ఎన్టీఆర్ యవ స్పోర్ట్స్ మెన్ గా కనిపించి సగభాగం వయస్సు మళ్ళిన పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది.