మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.బుచ్చి బాబు డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది.
ఆ సినిమా హిట్ తో వైష్ణవ్ తేజ్ కు వరుస క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.ఆల్రెడీ క్రిష్ డైరక్షన్ లో ఒక సినిమా పూర్తి చేసిన వైష్ణవ్ తేజ్ తమిళ అర్జున్ రెడ్డి డైరక్టర్ గిరీశయ్యతో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నట్టు టాక్.
ఇక ఇవే కాకుండా మరోసారి బుచ్చి బాబు డైరక్షన్ లో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట వైష్ణవ్ తేజ్.
ఉప్పెన హిట్ తర్వాత బుచ్చి బాబు, మైత్రి మూవీ మేకర్స్ మరో సినిమా చేయాలని అనుకుంటున్నారు.యువ హీరోలతో అనుకున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.
బుచ్చి బాబు, వైష్ణవ్ తేజ్ కాంబో మరోసారి రిపీట్ అవుతుంది.మరి ఈసారి ఈ ఇద్దరు ఎలాంటి కథతో వస్తారో చూడాలి.
ఎన్.టి.ఆర్ తో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్న బుచ్చి బాబు ఆ సినిమాను 2023లో ప్లాన్ చేస్తారని తెలుస్తుంది.