తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ రాశిఖన్నా.ఊహలు గుసగుసలాడే, సుప్రీమ్ బెంగాల్ టైగర్, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం, ప్రతిరోజు పండగే సినిమాలతో మంచి పేరును సంపాదించుకుంది ఈ బ్యూటీ.
ప్రతిరోజు పండగే సినిమా హిట్ అనంతరం అనుకున్న అన్ని ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయినా, ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.ప్రస్తుతం రాశిఖన్నా తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా తమిళం ఇండస్ట్రీ నుంచి నటించే ఆఫర్లు రావడంతో చాలా బిజీగా అయిపోయింది.
అతి త్వరలోనే ఈ బ్యూటీ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లు సమాచారం.ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలియచేసింది.
ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.దీనితో రాజ్ అండ్ డీకే చాలా ఫేమస్ అయిపోయారు.
అలాగే ప్రస్తుతం ది ఫ్యామిలీ మాన్ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.దీనిని కూడా రాజ్ అండ్ డీకే నిర్వహిస్తున్నట్లు ముందుకు తీసుకొని రాబోతున్నట్లు సమాచారం.
ఇందులో మనోజ్ పై కీలక పాత్రలో వహిస్తుండగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అక్కినేని సమంత ప్రేక్షకుల ముందుకు అలరించబోతోంది.ఈ తరుణంలో ఇటీవల అక్కినేని సమంత ట్విట్టర్ ఎమోజీని కూడా సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తుండగా, షాహిద్ కపూర్ సరసన రాశిఖన్నా నటిస్తున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని రాశిఖన్నా స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
ఈ పోస్ట్ లో రాశిఖన్నా షాహిద్ కపూర్ తో సెల్ఫీ దిగిన ఫోటోకు సైలెంట్ ఎమోజీని జత చేసింది.అలాగే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.
.