ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడం తో అందరూ కూడా తమ తమ ప్రచారాలతో మునిగిపోతున్నారు.ఫిబ్రవరి 8 న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా,ఫిబ్రవరి 11 న ఫలితాలు వెలువడనున్నాయి.
ఈ ఎన్నికల కోసం ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠ తో ఎదురుచూస్తున్నారు.అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అభ్యర్థి పై దాడి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
బీఎస్పీ అభ్యర్థి నారాయణ్ దత్త్ శర్మపై బుధవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు.బాదర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నారాయణ్ దత్త్.
నిన్న రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తున్నక్రమంలో బీఎస్పీ అభ్యర్థి కారును 8 నుంచి 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆపారు.ఆ తర్వాత అతని కారుపై అనంతరం నారాయణ్ దత్త్ పై కర్ర లతో దాడికి దిగారు.
దీనితో అతని తలకు,ముఖం పై గాయాలు అయినట్లు సమాచారం.
అయితే ఎన్నికల్లో ఓడిపోతాము అన్న భయంతోనే ప్రత్యర్ధులు నాపై దాడికి దిగారు అంటూ ఆరోపిస్తూ నారాయణ్ దత్త్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.