సోమవారం నుంచి రిలయన్స్ ‘జియో’ పూర్తిస్థాయి సేవలు అందించనున్న నేపథ్యంలో పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం భారత బీఎస్ఎన్ఎల్ సరికొత్త బ్రాడ్బాండ్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.వినియోగదారులను ఆకర్షించేందుకు భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కొత్త పథకాన్ని ప్రెవేశ పెట్టింది.
అపరిమితంగా ఇంటర్నెట్ను వినియోగించుకొనేందుకు రూ.249తో రీఛార్జ్ చేసుకుంటే 1జీబీ వరకు 2ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు.ఆ తదుపరి 1ఎంబీపీఎస్ వేగంతో అపరిమితంగా ఇంటర్నెట్ సేవలు వాడుకోవచ్చు.కానీ ఈ యొక్క నూతన పథకం కొత్త వినియోగదారులకు మాత్రమే.ఇది సెప్టెంబర్ 9 అందుబాటులోకి రానుంది
.