సీనియర్ ఆఫీసర్ ను చంపి తనను తాను కాల్చుకున్నాడు బీ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్.ఈ ఘటన రాజస్థాన్ లో సంచలనం సృష్టించింది.
శివ చందర్ అనే బీ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని శ్రీగంగా నగర్ సెక్టార్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలో తన సర్వీస్ తుపాకీతో తన పై అధికారి ఎసై రవీంద్ర పాల్ సింగ్ ను కాల్చి చంపి,అనంతరం తానూ కూడా సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయాన్ని బోర్డర్ గార్డింగ్ ఫోర్స్ వెల్లడించింది.జార్ఖండ్కు చెందిన శివ చందర్కు శ్రీగంగానగర్ సెక్టార్ లోని రేణుకా పోస్ట్ వద్ద విధులకు నియమించారు. ఈ క్రమంలో శివ చందర్ ఆదివారం అనగా మే3న డ్యూటీకి ఆలస్యంగా వచ్చాడు.దీనితో డ్యూటీ కి ఆలస్యంగా వచ్చాడు అన్న కారణంగా శివ పై అధికారి అయిన రవీంద్ర పాల్ సింగ్ అతడిని తిట్టాడు.
అయితే ఈ సమయంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వాదన మొదలవ్వడం తో ఒకానొక దశలో కోపాద్రిక్తుడైన శివ చందర్ తన సర్వీస్ తుపాకీతో రవీంద్ర పాల్ ను షూట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ ఘటనలో రవీంద్ర పాల్ ఘటనా స్థలిలోనే మృత్యువు ఒడిలోకి చేరినట్లు తెలుస్తుంది. అయితే క్షణికావేశంలో చేసిన తప్పుకు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైన శివ చందర్ రవీంద్ర పాల్ మృతిచెందడం తో భయాందోళనతో అదే సర్వీస్ రివాల్వర్ తీసుకొని తనకు తానుగా కాల్చుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఇద్దరి మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తి చేసినట్లు సమాచారం.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.