బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈనెల 29వ తేదీన నిర్వహించనున్నారు.హైదరాబాద్ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.
ఈ సమావేశానికి లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారని తెలుస్తోంది.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
అయితే ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.