సొంత అక్కపై తమ్ముళ్ల కిరాతకం..!

పరువు హత్యకు మరో యువతి బలైంది.కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో సొంత అక్కని పొట్టనబెట్టుకున్నారు.

 Brothers Cruelty On Own Sister, Crime, Love Marriage, Defamation,-TeluguStop.com

ఈ దారుణ ఘటన యూపీలో చోటుచేసుకుంది.మైన్‌పురి జిల్లాలోని అంగోతా గ్రామానికి చెందిన జ్యోతి మిశ్రా పొరుగు గ్రామమైన బ్రిజ్‌పురాకి చెందిన పశువైద్యుడు రోహిత్ యాదవ్‌ని ప్రేమించింది.

రెండేళ్ల కిందట ఇంటి నుంచి పారిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకుంది.అయితే తమ ఇష్టానికి వ్యతిరేకంగా తక్కువ కులానికి చెందన వ్యక్తిని పెళ్లి చేసుకుని పరువు తీసిందని ఆమె తమ్ముళ్లు కోపం పెంచుకున్నారు.

అక్కని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.ఆమెను ఏమీ చేయవద్దని.

వదిలిపెట్టాలని కుటుంబ సభ్యులు సర్దిచెప్పినా లోలోపల పగతో రగిలిపోయారు.

టీనేజ్ కూడా దాటని తమ్ముళ్లు సరైన అవకాశం కోసం ఎదురుచూశారు.

అదనుచూసి అక్క, ఆమె భర్తపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు.ఆమె తమ్ముడు గుల్షాన్ మిశ్రా(19) మరో ఇద్దరు సోదరులు తుపాకీతో అక్కని కాల్చేశారు.

రెండు తుపాకులతో ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.అందులో ఒక బుల్లెట్ రోహిత్ కడుపులో నుంచి దూసుకెళ్లింది.

సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అక్క కారణంగా ఊళ్లో అవమానాలకు గురవుతున్నామని.

అందుకే హత్య చేశామని చెప్పినట్లు తెలుస్తోంది.

అక్క భర్తని కాళ్లలో కాల్చి అవిటివాడిని చేయాలని భావించామని.

అగ్రకుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతం నరకం అనుభవించేలా చేయాలనుకున్నట్లు విచారణలో చెప్పడంతో పోలీసులే షాక్‌కి గురయ్యారు.నిందితులను అరెస్టు చేసి హత్య నేరం కింద కేసులు నమోదు చేసి జైలుకి పంపారు.

తీవ్రంగా గాయపడిన రోహిత్ యాదవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube