ఎప్పుడో అమ్మమ్మల కాలంలో 10 మంది 12 మంది ఇలా కంటూ ఉండేవారు.కానీఈ రోజుల్లో మాత్రం ఒకరు లేదా ఇద్దరు అన్న మాటే ఎక్కువగా వినిపిస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కు ఒకరు లేదంటే ఇద్దరినీ పెంచడమే చాలా కష్టంగా ఉంటుంది అని,మరొకటి ఇద్దరు కంటే ఎక్కువమంది ఉంటె ఆ ఇల్లు ఇల్లు లాగా కాకుండా రణరంగం అన్న ఫీల్ వస్తుంది.కానీ బ్రిటన్ కు చెందిన సూ రాడ్ ఫోర్డ్ అనే మహిళ మాత్రం ఇప్పటికి 21 మందికి జన్మనిచ్చి ఇప్పుడు తాజాగా 22 వ బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఆమె దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.అయితే సూ రాడ్ఫోర్డ్ మూడేళ్ల కిందట 21వ బిడ్డను కంటున్నప్పుడు తాను ఇకపై గర్భం దాల్చనని చెప్పింది.అయితే ఆ మాట మర్చిపోయి మళ్లీ తల్లికాబోతున్నట్లు ఆమె దిగిన సెల్ఫీ తో తెలుస్తుంది.45 ఏళ్ల రాడ్ఫోర్డ్ 14వ ఏట తొలి బిడ్డ కు జన్మనివ్వగా అప్పటి నుంచి కూడా గ్యాప్ లేకుండా కంటూనే ఉంది.మధ్యలో ఒక నెలలు నిండని బిడ్డ పుట్టి చనిపోయాడు.21 మంది పిల్లలతో కళకళలాడుతుంటుంది రాడ్ ఫోర్డ్ల కుటుంబం.11మంది మగపిల్లలు, 10 మంది ఆడపిల్లలు.లాంకషైర్ లోని మోర్ కాంబేలో నివసిస్తున్న ఈ కుటుంబం బ్రిటన్లో అతిపెద్ద కుటుంబం.
పెద్ద కొడుకు క్రిష్ వయసు 30 ఏళ్లు.ఈ గంపెడు సంతానానికి ఆడుకోవడానికి వేరే ఇరుగుపొరుగు పిల్లలు అక్కర్లేదు.పెద్ద కూతురు సోఫీకి కూడా పెళ్లయి ముగ్గురు పిల్లలు.రాడ్ఫోర్డ్ల ఇల్లు ఓ చిన్న హాస్టల్లా ఉంటుందట.ఇక అంతమంది ఉన్న ఆ ఇంట్లో రోజూ లీటర్ల కొద్దీ పాలు, పళ్ల రసాలు, డబ్బాల కొద్దీ బ్రెడ్డు, వందలాది గుడ్లు, కేజీల కొద్దీ మాంసం ఎంచక్కా ఆవిరైపోతుంటాయి.ఇంట్లో 10 బెడ్ రూములు ఉన్నాయి.
సూ పొద్దున ఆరు గంటలకు లేచి పిల్లల బాగోగులు చూసుకుని రాత్రి 11 గంటలకు పడుకుంటుంద ట.