కరోనా మహమ్మారి ముందు ఎవరు అతీతులు కాదు.రోజురోజూకు జోరు పెంచుకుంటున్న ఈ వైరస్ దాటికి ప్రతి ఒక్కరు భయపడాల్సిందే.
అందుకే అధికారులు, ప్రభుత్వం అత్యవసర కార్యక్రమాలు తప్ప మిగతావి అన్ని వాయిదా వేసుకోవాలని సూచిస్తుంది.ఈ క్రమంలో లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో అతి తక్కువ మందితో తగు కరోనా నియంత్రణ జాగ్రత్తల నడుమ శుభాకార్యాలు, పెళ్లిళ్లు జరిపిస్తున్నారు ప్రజలు.
ఈ క్రమంలో తెల్లవారితే పెళ్లి అనగా వధువు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వివాహాం నిలిచిపోయింది.వివరాల్లోకి వెళ్లితే.
కర్నూలు జిల్లా నందికొట్కూరులోని స్థానిక చెంచుకాలనీకి చెందిన యువతికి ఈ నెల 25న వివాహం నిశ్చయించారు పెద్దలు.అయితే, కొవిడ్ నిబంధనల ప్రకారం పెళ్లికి మూడు రోజుల ముందు వధూవరులిద్దరూ కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.
శనివారం ఉదయం వచ్చిన వారి టెస్టుల రిపోర్టులు వచ్చాయి.వాటిల్లో వధువుకు కరోనా సోకినట్టు తేలింది.
దీంతో అధికారులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని విషయం చెప్పి, క్వారంటైన్ చేశారు.అలాగే, ఆమెకు సన్నిహితంగా ఉన్నవారి నమూనాలను సేకరించారు.
ఇక చేసేదేమీ లేక ఇరు కుటుంబాలు పెళ్లిని వాయిదా వేసుకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.
పెళ్లి తంతులో భాగంగా గురువారం యువకుడిని పెళ్లి కుమారుడిని చేసే కార్యక్రమం ప్రారంభించారు పెద్దలు.అదే సమయంలో అతడికి కరోనా సోకినట్టు రిపోర్టులు రావడంతో చేసేదేమీ లేక పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
ఈ క్రమంలో కరోనా జోరు తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.