అంగరంగ వైభవంగా పెళ్లి పందిరి వేశారు.మేళ తాళాల మధ్య పెళ్లి తంతు కూడా జరుగుతుంది.
అగ్ని సాక్షిగా వరుడు తో కలిసి వధువు ఏడూ అడుగులు కూడా వేసింది.ఏడూ అడుగులు వేసిన తర్వాత వధువు పెళ్లి పందిరి నుండి వెళ్లిపోవడంతో వధువు కుటుంబ సభ్యులతో పాటు వరుడు కుటుంబ సభ్యులు, చుట్టాలు అందరూ షాక్ అయ్యారు.
అసలు పెళ్లి మధ్యలో నుండి ఎందుకు వెళ్లి పోయిందో అక్కడ ఉన్న ఎవ్వరికి తెలియదు.
వధువు పెళ్లి మధ్యలో నుండి వెళ్లి పోవడంతో వరుడు ధర్నా కు దిగాడు.
ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.ఈ ఊహించని సంఘటనకు షాక్ అవ్వడం అందరి వంతు అయ్యింది.
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ పట్టణంలో చందా అనే వధువుతో వినోద్ అనే వరుడు పెళ్లి నిశ్చయించారు.అంత అనుకున్నట్టుగానే జరుగుంది అనుకుంటున్న సమయంలో పెళ్లి కూతురు అందరికి పెద్ద షాక్ ఇచ్చింది.
పెళ్లి తంతు కూడా స్టార్ట్ అయ్యి ఏడు అడుగులు కూడా వేశారు.మరి కొద్దీ సమయంలో వరమాల, సింధూరం తంతు జరుగుతుంది అనగా పెళ్లి కూతురు మధ్యలో వెళ్లి పోవడంతో పెద్దలు ఆమెను ఎందుకు పెళ్లి మధ్యలోనే వెళ్లి పోయవని ప్రశ్నించగా షాకింగ్ ఆన్సర్ చెప్పింది.పెద్ద వారు వేసిన ప్రశ్నకు పెళ్లి కూతురు ‘వరుడు నచ్చలేదని‘ అందరికి చెప్పింది.
ఆమెను పెళ్ళికి ఒప్పించడానికి పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆమె మాత్రం ఒప్పుకోలేదు.దీంతో వరుడు కుటుంభం వధువు ఇంటి ముందు ధర్నా చేసారు.వరుడు వాళ్ళు పెళ్లి కోసం చేసిన ఖర్చు మొత్తం వధువు వాళ్ళు ఇవ్వాలని ధర్నా కు దిగారు.
దీంతో వధువు తండ్రి ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఇవ్వలేవని ఆయన తెలపడంతో ఇంకా వరుడు వాళ్ళు ఏమి చేయలేక వెళ్లిపోయారు.ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా చోటు చేసుకున్నాయి.