ఈ మధ్యకాలంలో పెండ్లిళ్ళు వివిధ రకాలుగా చేయడం పరిపాటిగా మారిపోయింది.వధూవరుల స్థోమతను బట్టి వారు ఖర్చుపెట్టే డబ్బులు ఏకంగా కోట్ల రూపాయలకు చేరుకుంది.
ఒకరిని మించి ఒకరు వారి స్థాయిని మించి కొందరు పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తూ అందరిని మెప్పించాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు.
సాధారణంగా మనం పెళ్లి వేడుకల్లో భాగంగా వధూవరులను వివిధ రకాలుగా ఆహ్వానం పలుకుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.
కొన్ని కొన్ని సందర్భాలలో వరుడుని కార్ లో కానీ, గుర్రంపై కానీ ఆహ్వానం పలుకుతూ ఉండడం మనం చూసే ఉంటాం.వధువును మేన మామలు పెళ్లి పల్లకిలో మోసుకొని మండపానికి తీసుకోని రావడం కూడా చూసే ఉంటాం.
కానీ, తాజాగా ఒక వధువు గుర్రం పై వరుడు ఇంటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.అంతేకాకుండా ఇదేం విడ్డూరం అని అందరూ నోరెళ్ళబెట్టి కొంటున్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లా చెందిన దీపా వలేచా అనే వధువు గుర్రంపై ఊరేగింపు వరుడు ఇంటికి వెళ్ళింది.సాధారణంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం వరుడు గుర్రంపై వధువు ఇంటికి రావడం ఒక సాంప్రదాయంగా వస్తుంది.అయితే ఈ సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.కొడుకులు కూతుళ్లు ఏ విషయంలో కూడా తీసిపోరని ఆ అమ్మాయి ఇలా చేసిందని అర్థమవుతుంది.అంతే కాకుండా ఆ అమ్మాయికి తన పెళ్లి సందర్భంగా వరుడు ఇంటికి గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లాలని తన చిరకాల కోరిక అంటూ పేర్కొంటుంది.
ప్రస్తుతం కుమార్తెలకు సమాజంలో కొడుకుల్లాగా సమాన హక్కులు ఉన్నాయని తెలియజేస్తూ వధువు గుర్రంపై వరుడు ఇంటికి వచ్చిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.