పెళ్లి అనేది మూడుముళ్ల బంధం… పెళ్లి అంటే రెండు మనసులు కలవడం.కానీ నేటి సమాజంలో పెళ్లి అంటే వధూవరులకు ముందు కట్నం నచ్చడం.
కట్నం లేనిదే ఏ పెళ్లిళ్లు జరగటం లేవు.అప్పు చేసైనా సరే అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటాడు తండ్రి.
అలాంటి పరిస్థితే ఒక చోట ఎదురయింది.తీరా పెళ్లి పీటలమీద కూర్చునే సమయంలో వరుడు అలిగిన ఘటన చోటుచేసుకుంది.
ఔరంగాబాద్ కు చెందిన యువకునితో ఈ నెల 25న ఓ అమ్మాయి తో వివాహం జరిపించాలని పెద్దల సమక్షంలో కుదుర్చుకున్నారు.తీరా పెళ్లి సమయం ముందు కొచ్చేసరికి అన్ని పెళ్లి పనులు దగ్గరుండి మరి చేసుకున్నారు.
బంధువులకు పెళ్లి కార్డులు కూడా పంచారు.పెళ్లి రోజు రానే వచ్చింది… వధువు పెళ్లి పీటల మీద కూర్చుంది.
వరుడు ఇంకా రాకపోయేసరికి….వధువు తరపున వాళ్ళు ఆందోళన చెందారు.
అసలు విషయం తెలుసుకోవడానికి వరుడు తరపున వాళ్లకి ఫోన్ చేశారు.మేము పెళ్లి చేసుకోమంటూ… పెళ్లి చేసుకోవాలి అంటే మాకు రూ.6 లక్షల కట్నం వెంటనే కావాలని లేదా పెళ్లి ఆపేస్తామని వరుడు తరపున వాళ్ళు తెలిపారు.దీంతో ఆ తండ్రి బాధ నిజంగా తట్టుకోలేనిదే.
పెళ్లి పీటల మీద కూర్చున్న అమ్మాయి… కాసేపట్లో ఓ ఇంటి కోడలు అవబోతుందని….ఇంతలో ఇలా జరిగిపోయిందని బాధపడుతూ వరుడు తరపున వాళ్ళు అడిగిన కట్నం ను వెంటనే బంధువుల నుండి రెండు లక్షల వరకు జమ చేశాడు….
కాగా వరుడు తరపున వాళ్లు మొత్తం కట్నం ను అందజేస్తేనే పెళ్లి చేసుకుంటామని బెదిరించారు.ఎటు అర్థంకాని పరిస్థితిలో ఆ తండ్రి పోలీసులకు వరుడు వాళ్లపై కేసు నమోదు చేశారు.
దీంతో పోలీసులు వరుడు తరపున వాళ్ల పై కేసు దర్యాప్తు చేస్తున్నారు.