సోషల్ మీడియా అంటేనే వింతలు వినోదాలకు పెట్టింది పేరు.రోజు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువుగా పెళ్లి వీడియోలు దర్శన మిస్తున్నాయి.నెటిజెన్స్ ఈ వీడియోలను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
తమకు నచ్చిన వీడియోలను లైక్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో గడుపుతున్నారు.
పెళ్ళిలో జరిగిన ఏదొక సంఘటనలు వీడియోల రూపంలో బయటకు వస్తూ నెటిజెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
కొన్ని వీడియోలు ఎమోషనల్ గా ఉంటే మరికొన్ని వీడియోలు కామెడీగా ఉంటున్నాయి.తాజాగా మరొక పెళ్లి వీడియో వైరల్ అయ్యింది.ఈ వీడియోలో వధూవరులు మండపంలోనే గిల్లికజ్జాలు పెట్టుకోవడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.ఇది చూసిన నెటిజెన్స్ మండపం నుండే మీ గిల్లి కజ్జాలు మొదలయ్యాయా.
అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మాములుగా భార్య భర్తలు అన్నాక గొడవలు సహజం.
చిన్న చిన్న గిల్లికజ్జాలు, అలకలు లేకపోతే లైఫ్ బోరింగ్ గా ఉంటుంది.
అవి ఉంటేనే బంధం మరింత బలపడుతుంది.అయితే మరి పెళ్లి మండపంలోనే ఈ గిల్లికజ్జాలు మొదలు పెడితే కాస్త వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది.పెళ్ళైన కొత్తలో దంపతుల మధ్యలో పెద్దగా గొడవలు రావు.
అలాంటిది పెళ్లి మడపంలోనే గొడవ పడిన సంఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పెళ్లి మండపంలో ఫోటో షూట్ జరుగుతుంది.
ఆ సమయంలో వరుడు కుర్చీలో కూర్చోగా వధువు పక్కనే నేలపై కూర్చుంది.ఈ సమయంలోనే వధువు అరటిపండు తినాలని అనుకుంది.
అయితే వరుడు మాత్రం పెళ్లి కూతురు చేతిలో ఉన్న అరటిపండును అలానే లాగేసుకుని వెంటనే తినేసాడు.అయితే మళ్ళీ వధువు ఇంకో పండును తీసుకోగా అది కూడా అలాగే తినేసాడు.
దీంతో వధువుకు కాస్త కోపం వచ్చింది.వెంటనే భర్త వైపు తిరిగి కోపంగా చూసింది.కానీ పెళ్లి కొడుకు మాత్రం ఇవేమి పట్టించుకోలేదు.తన మానాన తాను అరటిపండు తింటూ కూర్చున్నాడు.ఈ పెళ్లి కేరళ లో జరిగింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీరు కూడా ఈ ఫన్నీ వీడియోను చూసేయండి.