మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇప్పటికే పులివెందులకు వెళ్లిన అధికారులు ఎంపీ అవినాశ్ కు నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే వైఎస్ వివేకా హత్య కేసు ఫైల్స్ ను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలించారు.కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరాబాద్ కు ఫైల్స్ బదిలీ అయ్యాయి.
అదేవిధంగా మూడు బాక్సుల్లో ఛార్జిషీట్లు, సాక్షుల వాంగ్మూలంతో పాటు ఫైల్స్ లను అధికారులు తరలించారు.కడప కోర్టులో ఐదుగురి నిందితులపై రెండు ఛార్జిషీట్లు ఉన్న సంగతి తెలిసిందే.
కాగా వైఎస్ వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.