కొత్త బంగారులోకం సినిమాలో “ఎక్కడా.ఎప్పుడూ.” అంటూ క్యూట్ గా డైలాగులు చెబుతూ కుర్రకారు హృదయాలను అమాంతం దోచేసిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ 2015 వ సంవత్సరం వరకు తెలుగు సినిమాల్లో నటించారు.ఆపై బాలీవుడ్ లో అడుగుపెట్టి చాలా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు.
ఇటీవల కాలంలో ఈమె పలు బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించారు.అయితే ఈ నేపథ్యంలోనే శ్వేతాబసుప్రసాద్ తన భర్త గురించి, తన విడాకుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతుంది.
శ్వేతా బసు ప్రసాద్ డిసెంబర్ 13, 2018 సంవత్సరంలో దర్శకుడు రోహిత్ మిట్టల్ ని పెళ్లి చేసుకున్నారు.
అయితే 2019 డిసెంబర్ 10వ తేదీన ఆమె తన భర్త రోహిత్ మిట్టల్ కి విడాకులు ఇచ్చానని ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించి షాక్ ఇచ్చారు.తాజాగా ఆమె తన విడాకుల గురించి స్పందించారు.“కొన్ని కారణాల వలన మేము విడిపోవాల్సి వచ్చింది.పెళ్లి చేసుకొని పదేళ్ల లేక ఇంకా ఎక్కువ సంవత్సరాల పాటు కాపురం చేసి విడిపోయిన వారిని మనం చూస్తూనే ఉన్నాం.
కానీ రోహిత్, నేను కేవలం 8 నెలల్లోనే విడిపోయాము.అందుకే మేము విడిపోవడాన్ని విడాకులు అనే పెద్ద పదం తో పోల్చదలుచుకోలేదు.రోహిత్ నుంచి విడిపోవడం నాకు ఒక బ్రేకప్ లాగా అనిపిస్తుంది.అయితే ఆయన నుంచి దూరం అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను.
ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు అండగా ఉంటూ ధైర్యం చెప్పారు.అలాగే నాకు నేను ఒక మంచి స్నేహితురాలిని అయ్యాను” అంటూ శ్వేతా బసు ప్రసాద్ చెప్పుకొచ్చారు.
ఇటీవల ఈమె తన 30 వ పుట్టినరోజును అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.గతంలో జరిగిన చేదు అనుభవాలు అన్నీ మర్చిపోయి ప్రస్తుతం తన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నానని ఆమె చెబుతున్నారు.ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మళ్లీ అడుగు పెడతారో లేదో చూడాలి.