అసోంలోని కామ్రూప్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.పలాస్ బరి ఏరియాలోని ఫ్యాక్టరీలో ఆకస్మాతుగా మంటలు చెలరేగాయి.
క్షణాల్లోనే పరిశ్రమ అంతటా మంటలు వ్యాపించాయి.మంటల ధాటికి కార్మికులు అందరూ బయటకు పరుగులు తీశారు.
సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి.? పరిశ్రమలో ఎవరైనా చిక్కుకున్నారా.? అనే విషయం తెలియాల్సి ఉంది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.