ఇండోర్ వన్డేలో భారత ఆటగాళ్లు చెలరేగారు.రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ సెంచరీలతో విజృంభించారు.
రోహిత్, గిల్ లు కివీస్ బౌలర్లను చీల్చి చెండాడారు.పోటాపోటీగా బౌండరీలు బాధుతున్నారు.
దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ వన్డే కెరీర్ లో 30వ సెంచరీ నమోదు చేసుకున్నారు.ఇటు శుభ్ మన్ గిల్ వన్డే కేరీర్ లో నాలుగో సెంచరీ చేశారు.
టీమిండియా ఓపెనర్ల దూకుడుకు కివీస్ బౌలర్లు విలవిలలాడుతున్నారని చెప్పొచ్చు.ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ పోటాపోటీగా సిక్సర్లు, బౌండరీలు బాదుతున్నారు.
దీంతో 25 ఓవర్లలోనే టీమిండియా 205 పరుగులు చేసింది.