కాకినాడ జిల్లాలో తునిలో కల్తీ ఆయిల్ తీవ్ర కలకలం సృష్టించింది.జంతు కళేబరాలతో ఆయిల్ తీస్తున్న ముఠా గుట్టు రట్టైంది.
రామకృష్ణా కాలనీలో గో సంరక్షణ సభ్యులు, పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ సోదాలలో ఇంట్లో చంపి ఉంచిన గోవులు, జంతు కళేబరాలు, ఆవు చర్మాలతో పాటు కల్తీ ఆయిల్ ను అధికారులు గుర్తించారు.
గోవుల్ని చంపి వాటి రక్తం, వ్యర్థాలను ముఠా సభ్యులు డ్రైనేజీలోకి వదిలి పెడుతున్నట్లు గుర్తించారు.అనంతరం సాధారణ నూనెలో ఈ కల్తీ ఆయిల్ ను కలిపి సప్లై చేస్తున్నారు.
ఈ క్రమంలో నకిలీ నూనెను ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.