కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటలో ఘోర ప్రమాదం జరిగింది.
అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారని సమాచారం.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఆయిల్ ట్యాంకర్ ను క్లీన్ చేసేందుకు లోపలికి దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది.
మృతుల్లో ఐదుగురు పాడేరుకు చెందిన వారిగా గుర్తించారు.