తన కామెడీ టైమింగ్ తో అందర్నీ ఇట్టే ఆకట్టుకొనే వ్యక్తి హాస్య బ్రహ్మ బ్రహ్మనందం .గత కొన్ని రోజులుగా తన ఆరోగ్య పరిస్థితి కాస్త సరిగ్గా లేని కారణంగా సినిమాలలో చాలా తక్కువగా కనిపిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా అతనికి సమయం దొరికినప్పుడల్లా బొమ్మలు గీస్తూ… ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కాబోలు.ఇకపోతే తాజాగా తనలోని అద్భుతమైన కళ ను మరోసారి బయట పెట్టాడు బ్రహ్మి.
అవును, నిన్నటి నాడు అయోధ్య రామమందిర నిర్మాణానికి పునాది రాయి పడిన తరుణంలో బ్రహ్మానందం మరోసారి తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు.
అయోధ్య రామమందిర భూమి పూజ సందర్భంగా బ్రహ్మానందం శ్రీరాముడు, ఆంజినేయుల స్కెచ్ వేశారు.
ఆ చిత్రంలో శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు ఒకరిని ఒకరు ఆత్మీయంగా హత్తుకునే లాగా చిత్రాన్ని అత్యద్భుతంగా గీసారు బ్రహ్మానందం.నిజానికి ఆ చిత్రం చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి.
ఆ చిత్రంలో ఆంజనేయుడు తన్మయం తో కన్నీరు కారుస్తూ ఉండడం గమించవచ్చు.రాముడికి గుడి కడుతున్న వేళ ఆనంద పడుతున్నట్లు కనిపించే విధంగా అద్భుతంగా ఉంది ఆ చిత్రం.
నిజానికి ఈ బొమ్మ చూస్తే గుండె బరువెక్కినంతగా ఆయన వేశారు.
ఇక బ్రహ్మానందం గీసిన ఈ చిత్రాన్ని చూసి నెటిజన్లు వావ్ అంటూ ఫిదా అయిపోతున్నారు.
ప్రస్తుతం ఆయన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతున్న రంగమార్తాండ సినిమాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఏదిఏమైనా బ్రహ్మి ఆర్ట్ మాత్రం అదుర్స్.