సూపర్ స్టార్ మహేష్ తనని నైజాం నవాబ్ అని ఎందుకు అంటారో నిరూపించుకోబోతున్నాడా ? అవుననే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.బాహుబలి మినహాయిస్తే, నైజాంలో అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం శ్రీమంతుడు.ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ 14.40 కోట్లకు నైజాంలో కొనుగోలు చేసింది.ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రాన్ని ఇదే అభిషేక్ పిక్చర్స్ 13.80 కోట్లకు కొనుగోలు చేసింది.ఆ రకంగా ఎన్టీఆర్ రికార్డు కొట్టలేకపోయాడు.అయితే ట్రేడ్ సమాచారం ప్రకారం మహేష్ తన రికార్డుని మళ్ళి తానే బద్దలు కొట్టుకోబోతున్నాడు.
శ్రీమంతుడుని నైజాంలో పంపిణి చేసిన అభిషేక్ పిక్చర్స్ మళ్ళి బ్రహ్మోత్సవం చిత్రాన్ని కుడా నైజాంలో పంపిణి చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.బ్రహ్మోత్సవం నిర్మాతలు పి.వి.పి సినిమా నైజాం రేటు 20 కోట్లు చెబుతున్నారట.అంత రేటు చెబుతున్నా మార్కెట్ లో సినిమా డిమాండ్ భారీగానే ఉందట.చెప్పిన రేటు కాకుండా అటు ఇటుగా 18-20 కోట్ల మధ్య అమ్ముదిపోయినా భారి తేడాతో ఇది నిజంలో కొత్త రికార్డు అవుతుంది.
ఒకవేళ బ్రహ్మోత్సవం రికార్డు కొట్టినా అది ఎక్కువ రోజులు నిలవడం కష్టమే.సర్దార్ బిజినెస్ కూడా ఓపెన్ చేసారు నిర్మాతలు