సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలితో కలిసి ప్యారిస్ లో ఉన్నారు.అక్కడే దసరా సెలవులంతా ఎంజాయ్ చేసిన సూపర్ స్టార్ భారతదేశానికి తిరిగి వస్తున్నాడు.
మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం.మహేష్ సరసన్ సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు.
గత వారం హైదరాబాద్ షెడ్యుల్ ముగించుకున్న ఈ చిత్ర యూనిట్, మరో రెండు రోజుల్లో ఊటి బయలుదేరనున్నాడు.నవంబర్ 2 నుంచి 16 వరకు జరిగే ఈ షెడ్యుల్ లో మహేష్ తో పాటు ప్రధాన తారాగణంమంత పాల్గొననున్నారు.
శ్రీకాంత్ అడ్డాల స్టయిల్ లో తెరకెక్కుతున్న ఈ కుటుంబ కథ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీత దర్శకుడు.రత్నవేలు చాయాగ్రహణం అందిస్తున్నారు.
బ్రహ్మోత్సవాన్ని పి.వి.పి సంస్థ నిర్మిస్తుండగా, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సహా నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది.
చిత్ర షూటింగ్ ఫిబ్రవరి కల్ల పూర్తీ చేసి, నిర్మాంతర పనులు త్వరగా పూర్తీ చేసి ఏప్రిల్ లో బ్రహ్మోత్సవాన్ని విడుదల చేసే యోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు.