తెలుగు .తమిళ భాషల్లో సమంతా అగ్రకథానాయికగా వెలుగొందుతోంది.
తమిళంలో ఆమె విజయ్ తో చేసిన ‘తెరి’ .సూర్యతో చేసిన ’24’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.ఇలా చాలా తక్కువ గ్యాప్ లో సమంతా ఈ స్థాయి విజయాలను తన ఖాతాలో వేసుకోవడం విశేషం.
ఇక తెలుగులో మహేశ్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ .నితిన్ జోడీగా ‘అ ఆ’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలు కూడా చాలా తక్కువ గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ రెండు సినిమాలు కూడా హిట్ కాంబినేషన్ లో వస్తున్నవే కావడంతో, అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాల్లోను తాను వైవిధ్య భరితమైన పాత్రలను పోషించాననీ, ఇవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయనే నమ్మకం వుందని సమంతా అంటోంది.
ఇక ఇటీవల తనని సీనియర్ హీరోయిన్ అని అంటున్నారనీ, అందువల్లనే తాను ‘జనతా గ్యారేజ్’ లో కొత్తలుక్ తో కనిపించనున్నానని చెప్పుకొచ్చింది
.