తెలుగు కామెడీ స్టార్ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆయన ఏ సినిమాలోనైనా నటించాడని తెలిస్తే చాలు ఇక ఆ సినిమా పక్క విజయాన్ని అందిస్తుందని నమ్మకం ఉంటుంది.
ఇక ఈయన ప్రస్తుతం సినిమాలలో తక్కువగా కనిపించడంతో పాటు కొద్దిసేపు పాత్రల్లోనే అలరిస్తున్నాడు.తన ఆరోగ్యం సహకరించినందున ప్రేక్షకుల కోసం నటిస్తున్నాడనే చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉంటే అలసట తీసుకుని పరిగెత్తే గుర్రాన్ని అంటూ ఓ డైలాగ్ చెప్పాడు.
తాజాగా మహాశివరాత్రి సందర్భంగా గురువారం మార్చి 11 న విడుదలైన సినిమా జాతి రత్నాలు.
ఇక ఈ సినిమా అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కగా.ఇందులో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైటిల్ రోల్స్ గా నటించారు.ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా కేవలం ఒక్క రోజే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమా గురించి పలువురు నటులు మాట్లాడుతూ.
తాజాగా బ్రహ్మానందం ఈ సినిమా గురించి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
జాతి రత్నాలు అంటే పెద్ద పెద్ద మహాత్ముల పేర్లున్న మహాత్మా గాంధీ, కలామ్, లాల్ బహదూర్ శాస్త్రి పేరు చెప్పుకునే సినిమా కాదని.అబ్బో.వాడితో మనం మాట్లాడాలేంరా బాబు వాడు ఒక జాతి రత్నం.
అని అంటుంటాం కదా అలాంటి కోవకి చెందిన సినిమా అంటూ తెలిపాడు బ్రహ్మానందం.అంతే కాకుండా ఆయన కేవలం రెండు రోజుల పాత్రలోనే నటించానని తెలిపారు.ఇక ఈ సినిమాలో నటించిన నటుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుపుతూ వీరితో పాటు తను కూడా వస్తానంటూ.” వాళ్లు పరిగెత్తే గుర్రాలు.నేను అలసట తీసుకుని పరిగెత్తే గుర్రాన్ని.” అంటూ కుర్ర కారులతో నటించిన సినిమా హాట్సాఫ్ అంటూ తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.