టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గురించి, ఆయన చేసే కామెడీ గురించి అందరికీ తెలిసిందే.కాగా గత ఏడాది తను కరోనా సమయంలో కొన్ని విషయాలు కూడా తెలిపారు.
ఇదిలా ఉంటే నటులు బన్నీ, రానా లకు న్యూ ఇయర్ సందర్భంగా అందించిన గిఫ్ట్ అందర్నీ ఆశ్చర్యపరిచింది.
గత ఏడాది కరోనా సమయంలో బ్రహ్మానందం సినిమా షూటింగులు లేనందున ఇంట్లో కూర్చొని పెయింటింగ్ చేసే వారు.
అప్పట్లో అవి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.కాగా ఇటీవలే ఈ నూతన సంవత్సరం సందర్భంగా నటులు అల్లు అర్జున్, రానా దగ్గుపాటి లకు తను 45 రోజుల పాటు వేసిన వెంకటేశ్వర స్వామి పెయింటింగు ను ఫోటో ప్రేమ్ తో సహా తయారుచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలతో వాళ్ళిద్దరికీ అందించారు.
ఈ విధంగా ఈ బహుమతిని అందుకున్న హీరోలిద్దరూ బ్రహ్మానందం కు ఈ విధంగా ” సినీ పరిశ్రమలో మాకెంతో ఆత్మీయులైన బ్రహ్మానందం నుంచి పొందిన బహుమతి వెలకట్టనిది.45 రోజుల పాటు కష్టపడి మా కోసం న్యూ ఇయర్ సందర్భంగా అందించినందుకు ధన్యవాదాలు సర్” అంటూ అల్లు అర్జున్.”బ్రహ్మానందం గారు నూతన సంవత్సర సందర్భంగా నాకు ఈ అందమైన బహుమతిని అందజేశారు.మా తాతయ్య కూడా ఇలాంటి పెయింటింగ్ ను ఎంతగానో ఇష్టపడే వారు.
అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు సర్” అని రానా లు సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇక అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప‘ సినిమాలో నటించగా.
రష్మిక మందన హీరోయిన్ గా, హీరో విక్రమ్ విలన్ గా నటిస్తున్నారు.ఇక వేణు దర్శకత్వంలో రానా, సాయి పల్లవి, ప్రియమణి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ” విరాట పర్వం”.
కాగా ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.అంతేకాకుండా రానా హీరోగా ప్రభు దర్శకత్వంలో ” అరణ్య” సినిమా టీజర్ గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే.