హాస్యనటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయించుకున్న నటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
కొన్ని సినిమాలు కామెడీ వల్ల కూడా విజయవంతమయ్యాయి అంటే ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు.తెలుగు సినిమాలలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం తాజాగా పంచతంత్రం అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.మా కథకుడు రెడీ అంటూ బ్రహ్మానందం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.
ఇందులో బ్రహ్మానందం మైకు ముందు నిలబడి ఏదో చెబుతున్నట్టుగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది.పంచతంత్రం సినిమాలో సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్ వంటివారు కీలక పాత్రలో నటిస్తున్నారు.
హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాను టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.అందరికీ ఎంతో అవసరమయ్యే పంచేంద్రియాల మధ్య అల్లుకున్న కథే ఈ చిత్రమని చిత్ర బృందం వెల్లడించారు.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, దర్శకుడు వెల్లడించారు.ప్రస్తుతం చివరి దశలో షూటింగ్లో ఉన్న ఈ చిత్రం త్వరగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని ఈ సందర్భంగా దర్శకుడు తెలియజేశారు.