టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అతని ఆలోచనా విధానం ట్రెండ్ కు తగ్గట్టుగా మోల్డ్ అవుతూ కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది.
అలాగే అల్లు అరవింద్ మంచి బిజినెస్ చేయడంలో కింగ్ అని చెప్పవచ్చు.ఇటీవలే ఓటీటీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ అక్కడ కూడా తన సత్తా చాటుతున్నారు.
ఆన్లైన్ వేదికపై ఆహా ప్లాట్ ఫామ్ ఓపెన్ చేసి సరికొత్త పోగ్రామ్స్ తో జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు.
అల్లు అరవింద్ మొదలుపెట్టిన వ్యాపారానికి అన్ స్టాపబుల్ అంటూ బాలకృష్ణ అల్లు అరవింద్ స్పీడ్ ను పెంచారు.
ఈ స్పీడుకు టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందంను కూడా యాడ్ చేయనున్నారట.ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు హాజరైన విషయం తెలిసిందే.
ఆ తరువాత ఈ షోకి హీరో నాని బాలకృష్ణతో కలిసి సందడి సందడి చేశారు.ఇక ఆ తరువాత ఈ షోకి టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం వస్తున్నారట.
ఇటీవలే బాలకృష్ణ చేతికి దెబ్బ తగలడంతో సర్జరీ జరిగింది.దీంతో బాలకృష్ణ కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు.దీంతో ఈ షోకి కాస్త గ్యాప్ వచ్చింది.అయితే బాలకృష్ణ తిరిగి కోల్పోవడంతో.షూటింగ్ ని మళ్లీ మొదలు పెట్టారు.ఈ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి కమెడియన్ బ్రహ్మానందాన్ని రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే బుల్లితెరపై ఇక దబిడి దిబిడే.