నటుడు బ్రహ్మాజీ మన అందరికి సుపరిచితుడే.నటుడిగా ఆయనకంటూ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
అయితే బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు చూస్తే అందరిలోను ఆసక్తి కలుగుతుంది.ఆయన చేసే పోస్ట్ లు భలే విచిత్రంగా, అందరిని ఆలోచింపచేసేలా ఉంటాయి.
ఈ మధ్య బ్రహ్మాజీకి కోట్ల రూపాయిల లాటరీ తగిలినట్టు వచ్చిన మెసేజ్ ని సైబర్ పోలీసులకు పంపడంతో పాటు కింద కోటి రూపాయలు కలెక్ట్ చేసుకోమని ఒక కామెంట్ కూడా పెట్టాడు.తరువాత ఇలాంటి ఫేక్ మెసేజ్ కి రెస్పాండ్ అవ్వకండి అని తనదైన శైలిలో అందరిని అలెర్ట్ చేసారు.
ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సరికొత్త పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
ప్రస్తుతం టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల త్వరలో జరగబోతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ పోటీలో అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవడం కోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు, అలాగే సీవీఎల్ నరసింహారావు పోటీ చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది.వీళ్ళే కాకుండా లేడీస్ కూడా మా ఎన్నికల బరిలోకి దిగారు.ముఖ్యంగా నటి జీవిత రాజశేఖర్ అలాగే హేమా కూడా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం అందుతుంది.
మా ఎన్నికలు చూస్తుంటే రాజకీయ ఎన్నికల కంటే హాట్ హాట్ గా ఉన్నాయి.పదవిని చేజిక్కించుకోవడం కోసం నటుల మధ్య ఆరోపణలతో పాటు భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఈ క్రమంలో టాలీవుడ్ లో ఏర్పడిన మా ఎన్నికలపై బ్రహ్మాజీ కామెంట్ చేసారు.అది ఏంటంటే ” తాను చైనా అధ్యక్షుడిని కలిసినట్లు రాజకీయాల గురించి మాట్లాడానికి కాకుండా కేవలం ‘మా’ అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడినట్లు తెలియజేశారు.
అలాగే ఫొటోలో ఉన్న చైనా అధ్యక్షుడు కూడా ఎన్నికల గురించి కొన్ని సూచనలు ఇచ్చినట్లు ఒక ఫోటో షేర్ చేస్తూ కింద కామెంట్ చేశారు.అయితే బ్రహ్మాజీ నిజంగా చైనా అధ్యక్షుడిని కలవలేదు.
జిన్ పింగ్ ని బ్రహ్మాజీ కలిసినట్లు ఉన్న ఒక మార్ఫింగ్ ఫోటో తన అభిమానులతో పంచుకుంటూ మా అధ్యక్ష ఎన్నికలపై ఈ విధంగా ఒక సెటైర్ వేశారన్నమాట.