తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించిన బ్రహ్మజీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
అయితే చెన్నై నుండి వచ్చి మంచి సక్సెస్ సాధించిన వారిలో నటుడు బ్రహ్మాజీ కూడా ఒకరు.బ్రహ్మాజీతో పాటుగా రవితేజ, కృష్ణవంశీ మీరు కూడా చెన్నై నుంచి వచ్చి సక్సెస్ అయిన వారే.
ఈ ముగ్గురు కూడా ఒకేసారి సినీ ఇండస్ట్రీకి ఇది ఇచ్చి మంచి సక్సెస్ ను అందుకున్నారు.
కమెడియన్ బ్రహ్మాజీ టాలీవుడ్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరు అని చెప్పవచ్చు.
అన్నగా,తమ్ముడిగా,విలన్ గా ఇలా ఎన్నో ప్రాతలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు బ్రహ్మాజీ.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మాజీ తన కెరీర్ లో జరిగిన పలు ఆసక్తికర విషయాల గురించి వెల్లడించారు.
ఈ సందర్భంగా బ్రహ్మజీ మాట్లాడుతూ.నేను సినీ ఇండస్ట్రీకి వచ్చి 28 ఏళ్లు అవుతుంది.
ఒక నటుడికి ఐఏఎస్ కి ఐపీఎస్ కి ఇచ్చినంత గౌరవం ఇస్తున్నారు.నటులుగా మాకు మాత్రమే దక్కిన అదృష్టం ఇది.
అయితే ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి అవకాశాలు రావు.దానికి టైమ్ కూడా కలిసి రావాలి.అలా ప్రయత్నించి అవకాశాలను అందుకుని పై కొచ్చాం.ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంటుంది.సక్సెస్ అవ్వడం అన్నది అంత ఈజీ కాదు అని చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ.నేను రవితేజ చెన్నై బ్యాచ్.
చాలా స్ట్రగ్గుల్స్ ఎదుర్కొన్నాము.ప్రతి రోజు సాయంత్రం కలిసే వాళ్లం.
నాకు మొదటి ఛాన్స్ ఇచ్చింది కృష్ణ వంశీ.వాడు భవిష్యత్ డైరెక్టర్ అవుతాడని నన్ను పెట్టుకుంటే నీకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని పెద్ద డైరెక్టర్ అవుతావని వంశీని తెగ బెదరగొట్టేవాడినన్నారు బ్రహ్మాజీ.
తనది లవ్ మ్యారేజ్ అని బెంగాలీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పుకొచ్చారు బ్రహ్మాజీ.