పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ సినిమా చాలా ప్రత్యేకమైన మాస్ సినిమా అంటున్నారు.రచ్చ రచ్చగా ఈ సినిమా లో పవన్ మాస్ ఎలిమెంట్స్.
సన్నివేశాలు ఉంటాయి.ఇక ఈ సినిమా లో బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈమధ్య కాలంలో బ్రహ్మానందం అంతగా కనిపించడం లేదు.ఈ తరం ప్రేక్షకులు ఆయన కామెడీని మర్చి పోతున్నారు.
ఆయన కామెడీ లేక 1980 కిడ్స్ ప్రేక్షకులు సినిమాలపై ఆసక్తి కోల్పోతున్నారు.ఇలాంటి సమయంలో బ్రహ్మానందం రీ ఎంట్రీ అభిమానులకు ఆనందం కలిగిస్తుంది.
ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు కూడా సంతోషించేలా బ్రహ్మానందం రీ ఎంట్రీ గురించి భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.బ్రహ్మానందం కు సంబంధించిన పాత్ర ఏంటీ అనే విషయాన్ని క్లారిటీ ఇవ్వలేదు.కాని పోలీసుగా బ్రహ్మానందం కనిపిస్తాడని మాత్రం ఈ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది.బ్రహ్మానందం మరియు పవన్ కళ్యాణ్ ల మద్య ఉండే సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారు.
త్రివిక్రమ్ గారు ఖచ్చితంగా బ్రహ్మానందంకు మంచి పాత్ర రాసి ఉంటాడు అంటున్నారు.మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే.
భారీ ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్ లో బ్రహ్మానందం గారి రీ ఎంట్రీ సక్సెస్ అయ్యి ఆయన కొత్త ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి మళ్లీ మునుపటి లా రచ్చ చేయాలని కోరుకుంటున్నాం.పన్నెండు వందల సినిమా లను ఆయన చేసిన విషయం తెల్సిందే.
ఇప్పటి వరకు ఆయన ప్రతి ఒక్క పాత్ర తో నవ్వించాడు.కనుక ముందు ముందు కూడా నవ్విస్తాడనే ఆశిద్దాం.