ఒకవైపు కరోనా డెంజర్ బెల్స్ మోగిస్తుంటే గోవా లో మాత్రం టూరిస్టుల పార్టీలు ఏమాత్రం తగ్గడం లేదు.సామజిక దూరం పాటించాలి,మాస్క్ లు ధరించాలి అంటూ పలు సూచనలు చేస్తున్నప్పటికీ కూడా పార్టీ లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
గోవా లోని ఒక అర్బన్ ప్రాంతంలో రష్యా యువతి ఫేర్ వెల్ పార్టీ నిర్వహించింది.అయితే కరోనాను లెక్కచేయకుండా ఈ పార్టీ కోసం చాలామంది హాజరయ్యారు.
అయితే ఈ క్రమంలో మద్యం మత్తులో అక్కడకు వచ్చిన అమ్మాయిలు అబ్బాయిల మధ్య గొడవ జరిగింది.దీనితో ఒకరినొకరు కొట్టుకున్నారు.
అయితే దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గోవా అనేది టూరిస్ట్ ల స్వర్గధామం అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రష్యా కు చెందిన ఒక యువతి అక్కడ ఫేర్ వెల్ పార్టీ నిర్వహించడం తో కరోనా ఉందన్న విషయం కూడా మరచి పలువురు వ్యాపారవేత్తల పిల్లలు,మొదలగు వారు పాల్గొన్నట్లు తెలుస్తుంది.అయితే అందరూ మద్యం సేవించి ఉండడం తో చిన్న పాటి గొడవ చోటుచేసుకొని అది కాస్త ఒకరినొకరు కొట్టుకొనే పరిస్థితి నెలకొంది.
అయితే యువకులతో పాటు యువతులు కూడా ఈ పార్టీ లో గొడవపడినట్లు తెలుస్తుంది.
అయితే కరోనా నేపథ్యంలో అసలు పార్టీలకు అనుమతి లేని ఇలాంటి సమయంలో ఇంత పెద్ద పార్టీ ఏర్పాటు చేయడం దీనికి ప్రముఖ వ్యాపారవేత్తల పిల్లలు కూడా హాజరు కావడం గమనార్హం.
మరి ఈ వీడియో సోషల్ మీడియా లో ప్రత్యక్షమవ్వడం తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.మరి దీనిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.