మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి ప్రస్తుతం మూడో సారి బాలకృష్ణతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.వరుస రెండు హిట్ చిత్రాలతో క్రేజీ కాంబినేషన్ గా ఉన్న వీరిద్దరి కాంబోలో వస్తున్నా మూడో సినిమా కావడంతో దీని మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇక మొదటి రెండు చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు.కెరియర్ లో ఇప్పటి వరకు కనిపించని విధంగా బాలకృష్ణ ఇందులో మొదటి సారి ఒక అఘోరా పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నాడు.
ఇక సినిమా కథ కూడా అతీంద్రియ శక్తుల నేపధ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాని పూర్తిగా ఇండియాలోనే బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఈ సారి లోకేషన్స్ కోసం కథ డిమాండ్ బట్టి ఇప్పటి వరకు తెలుగులో అతి తక్కువ మంది చేసే రిస్క్ చేస్తున్నాడు.
సినిమాలో ఒక పాత్ర రాయలసీమ నేపథ్యంలో, మరో పాత్ర వారణాసి నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు.
వారణాసిలో అఘోరాగా కనిపించే పాత్ర తాలూకు సన్నివేశాలు కొన్ని హిమాలయాల్లోను చిత్రీకరించనున్నారట.అందువలన పరిస్థితులు కుదురుకున్నాక అక్కడ ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.ఇక రాయలసీమకి చెందిన పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇతర దేశాల్లో చిత్రీకరించవలసివుంది.అంతటి రిస్క్ చేయడం కరెక్ట్ కాదని భావించిన బోయపాటి, రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేయించనున్నాడట.
లాక్ డౌన్ పూర్తికాగానే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.ఈ సినిమా ద్వారా బోయపాటి ఒక కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే.
మరి హిమాలయాలలో అఘోరా పాత్రలో బాలకృష్ణ ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి ఇప్పుడు నందమూరి ఫాన్స్ లో నెలకొని ఉంది.