టాలీవుడ్ లో పవర్ ఫుల్ మాస్ దర్శకుడుగా బోయపాటి శ్రీను తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.బోయపాటి సినిమా అంటే యాక్షన్ ఎపిసోడ్స్ పవర్ ఫుల్ గా ఉంటాయని అందరూ భావిస్తారు.
అందుకు తగ్గట్లుగానే గూస్ బాంబ్స్ లాంటి ఎపిసోడ్స్ ని అతని సినిమాలలో ప్లాన్ చేస్తాడు.అలాగే హీరోని చాలా పవర్ ఫుల్ గా చూపిస్తాడు.
మామూలు హీరోని కూడా యాక్షన్ ఎలివేషన్ ద్వారా పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేస్తాడు.ఒక వర్గం ఆడియన్స్ అయితే అతని సినిమాలలోనే యాక్షన్ ఎపిసోడ్స్ చూడటానికే వెళ్తారు.
ఇక బోయపాటి, బాలకృష్మ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక బోయపాటి సినిమాలు అంటే హీరో కంటే పవర్ ఫుల్ గా విలన్ పాత్ర ఉంటుంది.
జగపతిబాబుకి లెజెండ్ సినిమాతో విలన్ గా బ్రేక్ ఇచ్చాడు.అలాగే ఆది పినిశెట్టిని సరైనోడుతో పవర్ ఫుల్ విలన్ గా ప్రెజెంట్ చేశాడు.
ప్రస్తుతం బాలయ్యతో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే బోయటపాటిని దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత దిల్ రాజు.
భద్ర సినిమాతో బోయపాటి దర్శకుడుగా పరిచయం అయ్యాడు.రవితేజ కి మాస్ హీరోగా బ్రేక్ ఇచ్చిన చిత్రం భద్ర.15 ఏళ్ల తర్వాత మరల దిల్ రాజు, బోయపాటి కాంబినేషన్ మరో సారి ప్రేక్షకుల ముందుకి రానుంది.తాజాగా దిల్ రాజు బోయపాటితో నెక్స్ట్ సినిమా కోసం ఒప్పందం చేసుకున్నాడు.
ఇప్పటికే కథని కూడా లాక్ చేసినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తుంది.
బోయపాటి, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన సరైనోడును మించి ఈ సినిమా ఉండబోతుంది అని టాక్. బాలయ్య సినిమా పూర్తి కాగానే బోయపాటి దిల్ రాజు సినిమాపై వర్క్ చేస్తాడని సమాచారం.
.