దర్శకుడు బోయపాటి, బాలకృష్ణ కాంబోలో అఖండ సినిమా రాబోతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది.
ఇక ఈ ఈవెంట్ కు దర్శకుడు రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.పిలవగానే ఈవెంట్ కు వచ్చిన రాజమౌళి, అల్లు అర్జున్ గారికి థాంక్స్ చెప్పారు.అనంతరం దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.జై బాలయ్య అనేది ఎప్పుడూ మనం చెప్పుకుంటూనే ఉంటాము.
ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్.బన్నీకి,రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు.
ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలని ఆదరిస్తారు.గుండెల మీద చెయ్యి వేసుకుని చూసి బయటకు వచ్చేంత మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం బోయపాటి తెలిపారు.ఇందులో దేవుడిని కరుణించమని అడుగు.కనిపించమని అడుగు అనే డైలాగ్ చెప్పిన అనంతరం బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలయ్య చేయి ఇలా కావడానికి నేనే కారణం.సాంగ్ చేసిన తర్వాత స్ట్రచింగ్ చేయాలి.జై బాలయ్య సాంగ్ తర్వాత ఇంటికి వెళ్లి ఆయన స్ట్రచింగ్ చేస్తుండగా కాలు జారి పడిపోయాడు.
భుజం మీద బరువు పడింది.భుజం డిస్ లొకేట్ అయ్యింది. కానీ అప్పటికే కోటిన్నర రూపాయలతో సెట్ వేశాను.ఆ రాత్రి నాకు ఈ విషయం తెలియడంతో నా గుండె జారి పోయింది.పొద్దున్నే సెట్ కి రాగానే సాంగ్ ఆపేద్దామని చెప్పాను.కానీ బాలయ్య తన ఫ్యాన్స్ కోసం చేయాలి చేస్తాను అని పెయిన్ ఉన్నా కూడా సాంగ్ ను చేశారు అని చెప్పుకొచ్చారు బోయపాటి.