టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నాడు.బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.
ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్ అయ్యాయి.ఇప్పుడు అఖండ సినిమాపై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి.
గత కొన్ని రోజులుగా బాలకృష్ణ హిట్స్ లేక బాధపడుతున్నాడు.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు బాలయ్య.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇందులో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది.ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడిన కారణంగా మళ్ళీ ఈ సినిమా రీస్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాపై తాజాగా బోయపాటి శ్రీను స్పందించారు.ఆయన తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు.ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బోయపాటి ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు.ఒక పాట, క్లైమాక్స్, కొద్దిగా ప్యాచ్ వర్క్ మినహా మిగతా షూట్ మొత్తం కంప్లీట్ అయ్యిందని ఆయన తెలిపాడు.
కరోనా థర్డ్ వేవ్ కూడా ఉందంటున్న నేపథ్యంలో అన్ని సర్దుకున్నాకే ఈ సినిమాను విడుదల చేస్తామని ఆయన మీడియాకు తెలిపాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూట్ కోసం లొకేషన్స్ వెతుకుతున్నామని హైదరాబాద్ లో వర్షాల కారణంగా షూటింగ్ చేయడానికి ఇబందిగా ఉందని వెల్లడించాడు.ప్రస్తుతం కడపలో షూట్ కోసం లొకేషన్స్ వెతుకుతున్నామని తెలిపారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.