ఏపీ ప్రభుత్వం గోదావరి పుష్కరాలపై భారీగా ఖర్చు చేయించి ఒక షార్ట్ ఫిల్మ్ను తీయించింది అని, ఆ షార్ట్ ఫిల్మ్ను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించాడని అంతా అన్నారు.పుష్కరాల ప్రారంభం రోజు గోదావరికి సీఎం చంద్రబాబు హారతి ఇస్తున్న సమయంలో బోయపాటి మైక్ పట్టుకుని పక్కనే ఉండటంతో ఈ ప్రచారంకు బలం చేకూరినట్లు అయ్యింది.
ఈ షార్ట్ ఫిల్మ్ కోసం బోయపాటి ఏకంగా 7 కోట్ల పారితోషికం తీసుకున్నాడు అని, ఈ షార్ట్ ఫిల్మ్ వల్లే పుష్కరాల్లో తొక్కీసలాట జరిగిందనే విమర్శలు వచ్చాయి.
తాజాగా ఈ విషయంపై స్పందించిన బోయపాటి శ్రీను గోదావరికి ఇచ్చిన హారతి భక్తులకు క్లీయర్గా కనిపించేందుకు, ఎక్కడ, ఎలా చేయాలనే సలహాలను సీఎం చంద్రబాబు తనను అడిగారని, అందుకే తాను ముందు రోజు వెళ్లి, ప్రదేశంను ఎంపిక చేశాను అని, అలాగే ఆరోజు చంద్రబాబు గారు హారతి ఇవ్వగానే తాను పుష్కర స్థానం పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు.
పుష్కరాల షార్ట్ ఫిల్మ్ తీసేందుకు అంత తీరిక తన వద్ద లేదు అంటూ ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు.